– ఓటమి గెలుపుకు సోపానం
– ఇష్టమైన క్రీడలలో కష్టపడి రాణించాలి.
– ఉద్యోగులు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలి.
– టీఎస్-ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు
– టీఎస్ ఐఐసీ ఎంప్లాయిస్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం
(హైదరాబాద్, జనవరి 26 ): క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సహజమని టీఎస్-ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. ఓటమిని గెలుపుకు సోపానం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) ఆధ్వర్యంలో ఎల్బి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన టీఎస్-ఐఐసీ ఎంప్లాయిస్ స్పోర్ట్స్& కల్చరల్ మీట్ – 2019 బహుమతుల ప్రధానోత్సవం ఎల్ బి స్టేడియంలోని మీటింగ్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బాలమల్లు.. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులను అందజేశారు. అనంతరం టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎప్పుడు తీరిక లేకుండా ఉండే ఉద్యోగులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఉల్లాసాన్ని పొందాలన్నారు. తమకు నచ్చిన క్రీడలను ఎంచుకొని కష్టపడి సాధన చేసి అందులో రాణించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, ఉద్యోగాల నియమకాలలో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లను సీఎం కేసీఆర్ కల్పించారని బాలమల్లు పేర్కొన్నారు. విశ్రాంతి లేకుండా విధులను నిర్వహిస్తున్న టీఎస్ ఐఐసీ ఉద్యోగులు మానసిక ఉల్లాసాన్ని పొందెలా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ను నిర్వహించమన్నారు. ఈ పోటీలను ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించి విజయవంతం చేసినందుకు టీఎస్ ఐఐసీ అధికారులను, ఉద్యోగులను ప్రశంసించారు.
ఉద్యోగులందరు విధినిర్వహణలో ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని.. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తే ఎంతో ఉత్సాహంగా వారు విధులను నిర్వహిస్తారన్నారు.
గెలుపు ఓటములను సమానంగా తీసుకోని ఓడిన వారు భవిష్యత్తులో గెలుపు కోసం కృషి చేయాలని ఉద్యోగులకు బాలమల్లు సూచించారు. జయేష్ రంజన్ మాట్లాడుతూ.. టీఎస్ ఐఐసి ఉద్యోగుల సంతోషం, వినోదం కోసం స్పోర్స్ అండ్ కల్చరల్ మీట్ ను నిర్వహించినందుకు అభినందించారు. క్రిడా స్పూర్తితో ఆట,పాటలను ఆస్వాదించాలన్నారు. క్రీడలలో గెలుపొందిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ ఎండి ఈవీ నర్సింహారెడ్డి, సీఈవో మధుసూదన్, ఎండీ జి. వెంకట్ నర్సింహ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్యామ్ సుందర్, టీఎస్ ఐఐసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, చీఫ్ జనరల్ మేనేజర్ గీతాంజలి, పలువురు అధికారులు పాల్గొన్నారు.