ఇన్ సెంటివ్ స్కీం పతకాన్ని సాదించిన సైకిల్ మెసెంజర్
అభినందించిన రాగం సుజాత యాదవ్
పొటో: తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిస్ ఇన్ సెంటివ్ స్కీం కింద సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న సైకిల్ మెసెంజర్ దశరత్ ను అభినందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జగదీశ్వర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్.
హైదరాబాద్ ఆగష్టు 16(ఎక్స్ ప్రెస్ న్యూస్): తెలంగాణ రాష్ట్ర మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో 26 ఏళ్లుగా సైకిల్ మెసెంజర్ గా పని చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిస్ ఇన్ సెంటివ్ స్కీం పతకాన్ని సాధించిన బి దశరత్ ను ఆ శాఖ ప్రభుత్వ కార్యదర్శి యం. జగదీశ్వర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ అభినందించారు. దశరత్ చేసిన సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ పతకం అందుకోవడం అభినందనీయమన్నారు. కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్న ఇన్ సెంటివ్ సర్టిఫికేట్ ను, బంగారు పతకాన్ని, రూ. 5 లక్షల చెక్కును దశరత్ బుధవారం సచివాలయంలోని కార్యాలయంలో సెక్రటరీ జగదీశ్వర్ , రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ కు చూపించి వారిచే ప్రత్యేక అభినందనలు అందుకున్నారు. దశరత్ కు ఈ అవార్డు రావడం సంతోషకరమని, మరింత బాద్యతగా పనిచేసి అందరి మన్ననలు పొందాలని సూచించారు. తనకు ఈ అవార్డును ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ కార్యదర్శి జగదీశ్వర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రూ. 5లక్షల ను తన అమ్మాయి వివాహం కోసం వినియోగిస్తానని దశరత్ వెల్లడించారు.