ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) నూతన అధ్యక్షుడిగా రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్గా సబీనా ఇంద్రజీత్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో ఉన్న అమర్ గతంలో ఎపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా, అంతకు ముందు ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సాక్షి దినపత్రికలో కన్సల్టంట్ ఎడిటర్గా ఉన్నారు.
సబీనా ఇంద్రజీత్ దిల్లీలోని ఇండియన్ న్యూస్ అండ్ ఫీచర్స్ ఏజెన్సీ అసోసియేట్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.
కొత్త అధ్యక్ష, కార్యదర్శులకు ఐజేయూ నేతలు సిన్హా, శ్రీనివాస్రెడ్డి, సీనియర్ లీడర్ కె. అమర్నాథ్, విరాహత్ అలీ తదితరులు అభినందనలు తెలిపారు.