ఇంటింటికీ కంటి పరీక్షలు
మార్చి నెలాఖరు కల్లా ప్రారంభం
ప్రణాళికలు సిద్ధం చేయాలి
సమీక్షించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
హైదరాబాద్:
Contents
సిఎం కెసిఆర్ ముందు చూపుతో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ కంటి పరీక్షల పథకం మార్చి నెలాఖరుకల్లా ప్రారంభం కావాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలతో సిద్దం కావాలని సూచించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కార్యాలయంలో మంత్రి అధికారులతో శుక్రవారం ఈ అంశం మీద సమీక్షించారు.
ఈ సమీక్షలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.