“ఆవకాయ బిర్యానీ” సినిమా దర్శకులు శ్రీ అనీష్ కురువిళ్ళ గారు ముఖ్య అతిథిది గా పాల్గొన్న 50 వ సినీవారం కార్యక్రమంలో , అయన దర్శకత్వంలో రూపొందిన “ఆవకాయ బిర్యానీ” సినిమా ప్రదర్శన
తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ శనివారం సినివారంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ రోజుతో 50 వారాలు పూర్తి చేసుకుంది.
ప్రతీ శనివారం షార్ట్ ఫిల్మ్స్/డాక్యుమెంటరీలు/ఫీచర్ ఫిల్మ్స్ రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శన చేస్తున్నాం. 50 వ సినివారం లో భాగంగా ఈరోజు 21.10.17 సినివారం కార్యక్రమం 2:00 pm నుంచి 9:00 pm వరకు నిర్వహించాము.
మధ్యాహ్నం 2 గంటలకు
అహం గస్తీ దర్శకత్వంలో రూపొందిన వినూత్నమైన షార్ట్ ఫిల్మ్ “నో ఎస్కేప్” ప్రదర్శన చేసాం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ని తలపించేలా ఉంది.
ఇక 3 గంటలకి మహేష్ అక్కేనపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సందేశాత్మక లఘు చిత్రం
” ఒక్క క్షణం” ప్రదర్శన చేశాము. ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాలనే ఇతివృత్తం తో ఈ చిత్రం రూపొందించారు.
4గంటలకు గౌరీ శంకర్ రూపొందించిన “యుద్ధం” ప్రదర్శన జరిగింది.
ప్రదర్శన అనంతరం చిత్ర బృందాలతో ముఖాముఖీ కార్యక్రమం జరిగింది.
రవీంద్రభారతిలో తమ సినిమాలు ప్రదర్శనలు జరగడం ఆనందంగా ఉందని , ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం – సాంస్కృతిక శాఖ , సినివారం బృందానికి
కృతజ్ఞతలు తెలిపారు.
5గంటలకు
శ్రీ అనీష్ కురువిళ్ళ గారి దర్శకత్వంలో రూపొందిన “ఆవకాయ బిర్యానీ” సినిమా ప్రదర్శన చేసాము.
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల , చంద్రశేఖర్ కమ్ముల నిర్మాణం లో వచ్చింది. కమల్ కామరాజు, బిందు మాధవిలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆటో నడిపే కుర్రాడికి ఆవకాయ పచ్చళ్లు అమ్ముకునే ఓ అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కథానేపథ్యంలో తెరకెక్కింది.
ఈ కార్యక్రమంలో సినివారం రూపకర్త, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సినివారం గత 50 వారాలుగా యువ ఫిలిం మేకర్స్ కి సినిమా రంగానికి చెందిన వ్యక్తులతో సినిమా రంగంలోని పలు అంశాలపై గైడెన్స్ , సలహాలు , సూచనలు ఇస్తూ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక ఫ్లాట్ ఫామ్ లాగా విజయవంతంగా ఉపయోగపడుతుందని , భవిష్యత్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సినివారం వేదికగా ఇరాన్ , మెక్సికన్ , జర్మన్ సినిమా ఫెస్టివల్స్ ని నిర్వహించబోతున్నామని తద్వారా యువత అంతర్జాతీయ సినిమాలను గురించి తెల్సుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలని కోరారు. 50 వారాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా సినివారం టీం కి ,ఫిలిం మేకర్స్ కి అభినందనలు , శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సినిమా దర్శకుడు అనిష్ కురివిల్ల గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొని పలువురు యువ దర్శక , రచయితలు అడిగిన సందేహాలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా యువ చిత్రోత్సవం – లఘుచిత్రాలు పోటీని సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆ పోస్టర్ ను అనిష్ కురివిల్ల , సంచాలకులు మామిడి హరికృష్ణ విడుదల చేశారు. యువ చిత్రోత్సవం కాంటెస్టు గూర్చి తెలిపారు.
ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ సినివారం ఏర్పాటు చేయడానికి గల ఇతివృత్తాన్ని తెలిపారు. ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్ కి పదును పెట్టుకుంటూ కొత్తకథలతో, కథనాలతో, టెక్నిక్, Vటెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లు, డాక్యుమెంటరీలు అద్భుతమైన ప్రశంసలు పొందుతున్నాయి.
అయితే… ఇంతటి నవ్య ఆలోచనలతో దూసుకువస్తున్న నవతరం ఫిల్మ్ మేకర్స్ కి తమ ఫిల్మ్ ని ప్రదర్శించుకునే ప్రివ్యూ థియేటర్స్ కానీ, వేదికలు కానీ కొరతగా ఉన్నాయి. ఉన్నప్పటికి అవన్నీ వ్యయభరితంగా ఉన్నాయి. వారికి ఓ వేదికగా సినివారం ఏర్పాటు చేసి సినిమాల ప్రదర్శన చేస్తున్నామని, అలాగే “టాక్ ఎట్ సినివారం” అని ప్రతి నెల రెండవ శనివారం సినిమా రంగానికి చెందిన అంశాలను తెలియ పరుచుటకు సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులతో చర్చలను ఏర్పాటు చేస్తుంది.
ఔత్సాహిక యువ దర్శక-రచయిత-నటులు తాము తీసిన లఘుచిత్రాలు/డాక్యుమెంటరీలను ప్రదర్శించాలనుకునే యువ సినీ దర్శకులు ఈ “సినివారం” అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్తతరం సినిమాకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇలా “సినివారం” నవతరం సినిమా దర్శకులు-రచయిత-నటీనటులు-కళాకారులు ఎంతో మందికి తమ సృజనాత్మకత ని , నైపుణ్యాలను ప్రదర్షించే వేదికగా ఏర్పడిందని తెలిపారు.
https://www.facebook.com/Cinivaram/videos/1468797683174764/
blob:https://www.youtube.com/666ffab9-043b-4d2b-b2c6-cd60ee10eb36
https://www.facebook.com/Cinivaram/videos/1468745486513317/