ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగుచేస్తే అధిక లాభాలు – మంత్రి మహేందర్రెడ్డి
రంగారెడ్డి నవంబర్ 21 : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చన్వెల్లిలో పాలీహౌజ్ రైతుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ పార్థసారథి పాల్గొన్నారు.