దక్షిణ కొరియా కౌన్సిల్ జనరల్ కిమ్ హంగ్ టే, డిప్యూటీ కౌన్సిల్ జనరల్ డేసూ చాంగ్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఆర్ధిక సంబంధాలే కాకుండా సాంస్కృతిక, సామాజిక సంబంధాలనూ బలోపేతం చేసుకోవాలని దక్షిణ కొరియా భావిస్తుందని వారు సీఎంకు వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసే కొరియన్ సిటీలో భారీగా తమ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రానికి రూ. 4 వేల కోట్ల పెట్టుబడులతో 37 కొరియా కంపెనీలు రానున్నాయని 7 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల వాతావరణం సృష్టించామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణం పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.