అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతన చెల్లింపులకుశ్రీకారం – దేవాదాయ శాఖ మంత్రిఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 1: రాష్ట్ర దేవాదాయ శాఖలో నూనత శకం ఆరంభమైందని గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులు, ఆలయ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేస్తామన్న సీయం కేసీఆర్ హమీ ఇవాళ్టి నుంచి ఆచరణలోకి వచ్చిందన్నారు.
బొగ్గులకుంట దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరగిన కార్యక్రమంలో వేతనాల చెక్కును ఆంధ్రా బ్యాంకు మెనేజర్ రమణకు అందించారు. ఈ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు డిసెంబర్ 1 చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి చిన్నపొరపాటు జరగకుండా.. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు. మిగితా రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అర్చకులు,ఆలయ ఉద్యోగుల వేతనాలకు రూ.115 కోట్లు అంచనా వ్యయం అవుతుందని తెలిపారు. ఇప్పటికే రూ.37.50 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. దేవాలయాల ద్వారా వస్తున్న ఆదాయ వనరులను పరిగణలోకి తీసుకుని అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామన్నారు.
ఈ సందర్భంగా అర్చకులు,ఆలయ ఉద్యోగుల తరపున మంత్రివర్గ ఉప సంఘ సభ్యులైన తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాసయాదవ్, నాయిని నర్సింహా రెడ్డి,జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ కార్యదర్శి శివ శంకర్, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస రావు, ఆర్జేసీ కృష్ణ వేణి, ఇతర దేవాదాయ శాఖ అధికారులు, అర్చక సమాఖ్య ప్రతినిదులుగంగు భానుమూర్తి, గంగు ఉపేంద్ర శర్మ, అర్చకులు,ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూజూన్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత ముఖ్యమైందో ..అర్చకులు, ఆలయ ఉద్యోగులకు డిసెంబర్ 1 అంతే ముఖ్యమైందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పరిష్కారం చూపారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హమీ మేరకు అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలు నేరుగా నేటి నుంచి బ్యాంకుల్లో జమా అవుతాయని వెల్లడించారు. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమిస్తూ, దశల వారీగా సమస్యల పరిష్కారానికి దేవాదాయ శాఖ అధికారులు కృషి చేస్తున్నారన్నారు.