రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని ఆయన స్వగ్రామం ఇడుకుడిలో అంత్యక్రియలు నిర్వహించారు.
పలువురు కాంగ్రెస్, తెరాస ప్రజా ప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్వాయి అంత్యక్రియలకు హాజరయ్యారు.
పాల్వాయిని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.