అటవీ శాఖ ప్రధాన కార్యలయం అరణ్య భవన్ లో కొత్త సంవత్సర వేడుకలు.
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు పంచుకున్న అధికారులు, సిబ్బంది.
దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పర్యావరణం, అడవుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం పెట్టిన బాధ్యతను అధికారులు, సిబ్బంది కచ్చితంగా నెరవేర్చాలి అని అన్నారు అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి పీ.కే.ఝా. అరణ్య భవన్ లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో ఉన్నతాధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. హరితహారంతో సహా, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ప్రాజెక్టుల ప్రత్యామ్నాయ భూముల్లో మొక్కల పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ నిబద్దతతో చేపట్టాలని, ఈయేడాది కొత్తగా రెండు వేల మంది కొత్త సిబ్బంది అటవీ శాఖలో చేరుతున్న ప్రక్రియ తుది దశలో ఉందని, ఇది శాఖ మరింత బలోపేతానికి దోహదపడుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. కార్యక్రమంలో పీసీపీఎఫ్ రఘవీర్, పృధ్వీరాజ్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Contents