అంబేద్కర్ బాటలోనే సీఎం కేసీఆర్ – మంత్రి హరీశ్ రావు
అన్ని వర్గాల ప్రజలు ఉన్నత చదువులు చదివితే వెనుకబాటు, ఆర్థిక అసమానతలు దూరం అవుతాయని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. అందుకే, విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బి.ఆర్. అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.