అందాల నటి శ్రీదేవి దుబాయ్లో శనివారం రాత్రి కన్నుమూశారు.
1963 ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. 1967లో బాలనటిగా సినీరంగంలో ప్రవేశించి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు. 1996లో బోనీకపూర్తో శ్రీదేవికి వివాహమైంది. 2013లో భారత ప్రభుత్వం అమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అగ్ర సినీతారగా వెలుగొందిన శ్రీదేవి 15 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. చివరిగా ఆమె 2017లో ‘మామ్’లో నటించారు.
శ్రీదేవి మృతి పట్ల బాలీవుడ్తో పాటు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.