అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ సంజీవయ్య పార్క్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బిజెపి నేతలు ఉత్సాహంగా పాల్గొని యోగభ్యాసం చేశారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు, బిజెపి శాసనసభా పక్షనేత జి.కిషన్ రెడ్డితో పాటు బిజెపి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.