స్కోచ్ మెరీట్ అవార్డును అందుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్
న్యూ డిల్లీ సెప్టెంబర్ 8 (ఎక్స్ ప్రెస్ న్యూస్): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ట్రేడ్ లైసెన్స్ పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించినందుకుగాను జీహెచ్ఎంసీకి స్కోచ్ మెరీట్ ఆర్డర్ అవార్డును నేడు అందజేసింది. న్యూఢిల్లీలో నేడు జరిగిన 49వ స్కోచ్ సమ్మిట్ సమావేశంలో స్కోచ్ సంస్థ డైరెక్టర్ మనీష్కొచ్చార్, న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ వి.ఎన్.అలోక్లు ఈ మెరీట్ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డికి అందజేశారు.
పాలన రంగంలో వినూత్న విధానాల అమలు, పాలన సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వ విభాగాలను గుర్తించి స్కోచ్ సంస్థ జాతీయ స్థాయిలో ఈ అవార్డులను ప్రతి సంవత్సరం అందజేస్తుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల రూపెణ జీహెచ్ఎంసీకి రూ. 28.60కోట్లు లభించగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుల సేకరణ అనూహ్యంగా రూ. 42.84కోట్ల రూపాయలకు పెరిగింది. 2015-16లో 42,836 ట్రేడ్లైసెన్స్లు ఉండగా 2016-17లో వీటి సంఖ్య 76,860కి చేరింది. ట్రేడ్ లైసెన్స్ల జారీలో 79శాతం పురోగతి సాధించడం జీహెచ్ఎంసీలో చారిత్రక పరిణామం. 360 డిగ్రీల విధానంలో పలు రికార్డుల సమాచారాన్ని జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ జాబితాకు అనుసంధానం చేయడంతో లైసెన్స్లు లేకుండా ట్రేడింగ్ చేసే పలు సంస్థలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ట్రేడ్ లైసెన్స్ల జారీకి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడంతో ట్రేడ్ లైసెన్స్ల సంఖ్యలో 79శాతం పురోగతి సాధించింది. ఈ విజయాన్ని పరిగణలోకి తీసుకున్న స్కోచ్ సంస్థ జీహెచ్ఎంసీకి మెరీట్ అవార్డును ప్రకటించింది.
న్యూఢిల్లీలో నేడు జరిగిన స్కోచ్ లీడర్షిప్ సమ్మిట్లో ఈ మెరీట్ అవార్డును కమిషనర్ జనార్థన్రెడ్డి జీహెచ్ఎంసీ ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడీలు అందుకున్నారు. ఈ సందర్భంగా ట్రేడ్ లైససెన్స్ల పురోగతిని తెలియజేస్తూ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.