ఇటీవల ఆస్ట్రేలియా లోని గోల్డెకోస్ట్ నగరంలో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ మరియు వ్యక్తిగత విభాగంలో రజత పథకాలు సాధించిన నీలకుర్తి సిక్కి రెడ్డిని మరియు బాక్సింగ్ లో కాంస్య పథకాన్ని సాధించిన మహమ్మద్ హుసాముద్దీన్ లు సచివాలయంలో క్రీడా శాఖ మంత్రి పద్మారావు గౌడ్, తెలంగాణ స్పోర్ట్స్ సెక్రటరీ బుర్రా వెంకటేశం లను కలిశారు. ఈ కార్యక్రమం లో స్పోర్ట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సాట్స్ ఎండి. దినకర్ బాబు మరియు మంత్రి ప్రత్యేకాధికారి డా. ఎస్.ఏం. రాజేశ్వర్ రావు లు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా మంత్రి పద్మా రావు మాట్లాడుతూ నీలకుర్తి సిక్కి రెడ్డి మరియు మహమ్మద్ హుసాముద్దీన్ లు కామన్వెల్త్ క్రీడలలో అధ్బుతమైన ఆటను కనబరిచారని అన్నారు. రాబోయే ఒలింపిక్ క్రీడలలో మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆశించారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నీ విధాలా అండగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అన్నారు.