ఆకట్టుకున్న భరతనాట్యం, కూచిపూడి మరియు ఆంధ్రనాట్య ప్రదర్శనలు
ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామంలో భరతనాట్యం, కూచిపూడి మరియు ఆంధ్రనాట్యం నృత్యప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
భరతనాట్య కళాకారిణి కుమారి భానుప్రియ (బెంగళూరు) తన ప్రదర్శనలో గణేశ కృతితో పుష్పాంజలి, అలరిపు, రంజని, మృదు పంకజలోచని కీర్తన, జావళి, దేవరనామ, థిల్లాన అంశాలను ప్రదర్శించారు.
అభినయ కూచిపూడి నాట్యాలయం, ఖమ్మం గురువు శ్రీ చల్లా కొండలరావు గారి ఆధ్వర్యంలో, వారి శిష్యులు దేవి, వశిష్ట, సుస్మిత, రితిక, భవ్యశ్రీలు గణపతి కేతం, బ్రహ్మాంజలి, చక్కని తల్లికి అన్నమాచార్య కీర్తన, భు శంభో కీర్తనలను ప్రదర్శించారు.
సాయి నృత్యనికేతన్ శ్రీమతి పుష్పలత గారి ఆధ్వర్యంలో, వారి శిష్యబృందముచే ఆంధ్రనాట్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. శివ కైవారం, గంగాధర, పుష్పాంజలి, దశావతారం, వినాయకకేతం అంశాలను ప్రదర్శించారు.