శిల్పారామంలో హస్తకళాకారులకు హస్త కళాకృతుల ప్యాకేజింగ్ విధానాలపై భారత ప్రభుత్వ హస్త కళల అభివృద్ధి కమీషనర్ వారి ఆర్థిక సహాయముతో తేదీ: 8 మరియు 9 ఆగస్టు 2017, రెండు రోజుల కార్యశాల నిర్వహించబడినది.
ఈ కార్యక్రమమును శ్రీ జి. కిషన్ రావు గారు, స్పెషల్ ఆఫీసర్, శిల్పారామం గారు ప్రారంభించినారు. ఈ కార్యశాలలో 21 మంది హస్త కళాకారులు పాల్గొన్నారు.
శ్రీ వి.వి. సూర్యనారాయణ గారు (విశ్రాంత) హస్తకళల డైరెక్టరు, ప్యాకేజింగ్ యొక్క ఆవశ్యకతను వివరిస్తూ, తద్వారా వినియోగదారులకు ఆకర్షణీయంగా హస్త కళల ఉత్పత్తులను విక్రయించుట వలన తదుపరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలరని తెలిపినారు.
శ్రీమతి యశస్వి గారు డిజైనర్, వివిధ కళాకృతులకు అనుగుణముగా తగిన విధానాలను వివిధ ప్యాకేజింగ్ మెటీరియల్ మాధ్యమాలతో చూపించి చేయించారు.