శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్రకచేరి మరియు కూచిపూడి నృత్యాలు
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫి థియేటర్ లో కర్ణాటక గాత్రకచేరి మరియు కూచిపూడి నృత్యాలు అలరించాయి.
అంబిటస్ వరల్డ్ స్కూల్ శిష్య బృందంచే ” శరత్ సంకీర్తన సమీరం” గాత్ర కచేరి ఎంతగానో అలరించింది. శ్రీమతి జయశ్రీ నాయర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజల్వన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీ మధుసూదన రావు నేతృత్వంలో పిల్లలు చక్కగా గీతాలాపన చేశారు.
ఎస్.ఎల్.బి. కూచిపూడి కళా నిలయం శ్రీమతి డాక్టర్ వినీల రావు నేతృత్వంలో వారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది.
బ్రహ్మాంజలి, జతిస్వరం, బృందావనమిది, భూ:శంభో, నారాయణీయం, వచ్చెను అలివేలు మంగ, అతి నిరూపమ సుందరకారా మొదలైన అంశాలను ప్రదర్శించారు/