మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, మాజీ ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాక యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజ్ పేయి మృతి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. ఉదారవాది, మానవతావాది.. కవి, సిద్ధాంతకర్త. మంచి వక్త..నిరాడంబరుడు.. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన అటల్జీ ఆత్మకి శాంతి చేకూరాలని కెసిఆర్ అన్నారు.