పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో కమ్యూనిటీ మరియు ఎకనామిక్ డెవలప్ మెంట్ ప్రతినిధుల బృందం సమావేశం
టకోమా నగరం ( వాషింగ్టన్) లోని కమ్యూనిటీ మరియు ఎకనామిక్ డెవలప్ మెంట్ డిప్యుటీ మేయర్ అండర్స్ ఇబ్సెన్ (Anders Ibsen) మరియు ప్రాజెక్ట్ మేనేజర్ డెబ్లె బింఘం (Debble Bingham) ప్రతినిధుల బృందం ఈ రోజు పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో మంగళ వారం సెక్రటేరియట్ లో సమావేశం అయింది. తెలంగాణ రాష్ట్ర T.S. i-pass సింగల్ విండో విధానం దేశంలోనే ఎక్కడా లేని విధంగా చాలా బాగా అమలవుతోందని ఈ బృందం మెచ్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్రం పరిశ్రమలు మరియు సాంకేతిక విజ్ఞాన (I.T.) రంగాలలో ముందంజ లో ఉన్న కారణాలు జయేష్ రంజన్ ను అడిగి తెల్సుకున్నారు. పరిశ్రమలు, సాంకేతిక విజ్ఞానం శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రభుత్వ పథకాలైన T.S. i-Pass, ఇoడస్ట్రియల్ విధానం, సబ్సిడీలు, టెక్నికల్ మ్యాన్ పవర్, TASK గురించి టకోమా బృందానికి వివరించారు.
T-Bridge policy క్రింద మనరాష్ట్రంతో భాగస్వామ్యం అవడానికి టకోమా బృందo వారు ఆసక్తి చూపించారు. ఈ T-Bridge policy ద్వారా కంపనీలు, క్రొత్త స్టార్టప్స్ పరస్పర మార్పిడికి అవకాశం లభిస్తుంది.