ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు
హైదరాబాద్ సెప్టెంబర్ 2(ఎక్స్ ప్రెస్ న్యూస్): త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుంది. దైవ పరీక్షలో కట్టుకున్న భార్యను వదిలి, కన్నకొడుకు ప్రాణాలను బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుడి త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసిన అనంతరం ఖుర్బానీ ఇచ్చి దైవప్రీతి కోసం తమ ధనాన్ని, ప్రాణాన్ని, సంతానాన్ని, సమస్తమూ త్యాగం చేయడానికి సిద్ధమని నిరుపించుకుంటారు. బక్రీద్ సందర్భంగా నగరంలోని మసీదులన్నీ కిటకిటలాడాయి. ముస్లీం సోదరులంతా ఏకమై ఎంతో భక్తి శ్రద్ధలతో ఇవాళ బక్రీద్ పర్వదినాన్నిజరుపుకున్నారు.