ఉషాపతి ఉపరాష్ట్రపతి అయ్యారు: గవర్నర్ నరసింహన్
హైదరాబాద్ ఆగష్టు 21(ఎక్స్ ప్రెస్ న్యూస్): ఉపరాష్ర్టపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడు సేవలు దేశప్రజలందరికీ అవసరమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. రాజ్ భవన్ లో రాష్ర్ట ప్రభుత్వం తరపున ఘనంగా పౌరసన్మానం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్యకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యను ఘనంగా సన్మానించుకోవడం తెలుగు వారందరికీ ఈ రోజు శుభదినమని తెలిపారు. ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ర్టపతిగా ఎన్నికవడం అందరూ అభినందించాల్సిన విషయమన్నారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ర్టపతి అవడంపై గర్వపడుతున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తరపున వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం జరగడం గొప్పగా ఉందన్నారు. రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్యనాయుడు సమర్థవంతంగా పని చేయగలరని గవర్నర్ పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి ఉప రాష్ట్రపతి కావడం గర్వకారణమని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. తాను ఉషాపతినే కానీ ఉప రాష్ట్రపతిని కాదన్నారాయన. ఇప్పుడు ఉషాపతి ఉపరాష్ట్రపతి అయ్యారని తెలిపారు. వెంకయ్య ఎదుగుతూ…ఒదుగుతూ ఉన్నత స్థానానికి చేరారని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక తెలుగువారికి గుర్తింపు లభించిందని చెప్పుకొచ్చారు. చాలామంది అనేక పదవులు అనుభవిస్తారు కానీ.. వెంకయ్యనాయుడిలా పదవికి వన్నె తెచ్చే నేతలు కొందరే ఉంటారు. జాతీయస్థాయికి ఎదిగినా మూలాలు మరిచిపోని మనిషి ఆయన. నిన్నటి వరకు మనలో ఒకరిగా ఉన్న వెంకయ్యనాయుడు ఈరోజు ఉపరాష్ట్రపతి కావడం గర్వకారణంగా ఉంది. రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎలా చేరాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు. కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఉపరాష్ట్రపతి కావడం సామాన్య విషయం కాదు. నేటితరం రాజకీయ నేతలకు ఆయన ఆదర్శం.